News October 28, 2024
ఆర్థిక అనిశ్చితి కారణంగానే చైనా మెత్తబడింది: పరిశీలకులు

ఇతర దేశాలతో నిత్యం కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు బాగా వెనక్కి తగ్గింది. ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండటమే దీనికి కారణమని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ‘చైనా ఆర్థిక పరిస్థితి దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత ఘోరంగా ఉంది. ప్రొవిన్షియల్ ప్రభుత్వాలు దివాలా తీశాయి. రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఈ ఒత్తిడే ఆ దేశ విదేశీ విధానాల్లో మార్పును తీసుకొచ్చింది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


