News April 4, 2025

అమెరికాతో చైనా టారిఫ్ వార్.. 34శాతం సుంకం విధింపు

image

అమెరికా టారిఫ్‌లపై చైనా అన్నంత పని చేసింది. US ఉత్పత్తులపై 34శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల అన్ని దేశాలపై టారిఫ్‌లు పెంచిన అమెరికా చైనా పైనా 34శాతం సుంకం విధించింది. దీనిపై ఘాటుగా స్పందించిన డ్రాగన్ దేశం టారిఫ్ తగ్గించకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. కానీ అమెరికా దీనిపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రతీకారంగా చైనా 34శాతం సుంకం విధించింది.

Similar News

News April 11, 2025

నేటి నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్

image

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 10వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు లాహోర్ ఖలందర్స్‌తో రావల్పిండిలో తలపడనుంది. వచ్చే నెల 18 వరకు ఈ సీజన్ జరగనుంది. ఆరు జట్లు మొత్తం 34 మ్యాచులాడతాయి. కరాచీ కింగ్స్‌కు డేవిడ్ వార్నర్ ఆడనుండటం ఈసారి ప్రత్యేకతగా నిలవనుంది.

News April 11, 2025

బీజేపీలోకి విజయసాయి రెడ్డి?

image

AP: YSRCP, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నానని ప్రకటించిన మాజీ MP విజయసాయి రెడ్డి BJP తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. తొలుత టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారన్న టాక్ వినిపించినా.. ఫైనల్‌గా బీజేపీయే బెటర్ అని నిర్ణయించుకున్నారని సమాచారం. MPగా పెద్దల సభకు పంపిచేందుకు కమలనాథులూ ఓకే అన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

News April 11, 2025

2, 3 రోజుల్లో ఇంటర్ ఫలితాలు

image

AP: ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 3 నాటికే మూల్యాంకనం పూర్తవడంతో హాల్ టికెట్ల నంబర్ల ఆధారంగా మార్కుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. 2, 3 రోజుల్లోనే ఫలితాలను రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. bieap.gov.in, Way2Newsలో ఫలితాలను తెలుసుకోవచ్చు. కాగా మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

error: Content is protected !!