News January 20, 2025

చైనా దూకుడు.. ఏడాదిలో 800KMS మెట్రో మార్గం పొడిగింపు!

image

దేశంలోని నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను గట్టెక్కిస్తోన్న మెట్రో రైళ్లను విస్తరించడంలో ఇండియా స్పీడు పెంచాల్సి ఉంది. 2024లో ఇండియాలో కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అదే చైనాలో మాత్రం ఒకే ఏడాదిలో 800+కి.మీలు మెట్రో మార్గాన్ని విస్తరించారు. కాగా, ఇండియాలో మొత్తం 1,000 కి.మీల మెట్రో మార్గం ప్రస్తుతం అందుబాటులో ఉంది.

Similar News

News November 26, 2025

వికారాబాద్‌లో రిజర్వేషన్ల పూర్తి వివరాలు ఇవే.!

image

వికారాబాద్ జిల్లాలో 594 గ్రామపంచాయతీలకు 5,058 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులను వెలువడించారు. జిల్లాలో 594 గ్రామపంచాయతీలకు అన్‌రిజర్వ్డ్ 257 చేయగా మహిళలకు 133 కేటాయించారు. బీసీలకు 107 కేటాయించగా, ఎస్సీలకు 111, ఎస్టీలకు 119 కేటాయించారు. 92 ఎస్టీ గ్రామపంచాయతీలలో 100% ఎస్టీలు ఉండటంతో 92 ఎస్టీలకు కేటాయించారు. జిల్లాలో మొత్తం మహిళలకు 278 జీపీలకు రిజర్వేషన్లు కల్పించారు.

News November 26, 2025

కార్పొరేటర్లు అందరూ పార్టీకి ద్రోహం చేశారు: కాకాణి

image

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ బిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

News November 26, 2025

కార్పొరేటర్లు అందరూ పార్టీకి ద్రోహం చేశారు: కాకాణి

image

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ బిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.