News September 25, 2024
భూమికి భారంగా చైనా డ్యామ్!

చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఏకంగా 10 ట్రిలియన్ గాలన్ల నీరు అందులో నిల్వ ఉంటుంది. అంత బరువు ఒకేచోట నిల్వ ఉండటం భూమి గమనాన్ని ప్రభావితం చేస్తోంది. 0.06 సెకన్ల మేర భూ పరిభ్రమణ వేగం నెమ్మదించిందని పరిశోధకులు చెబుతున్నారు. దాని వల్ల సూర్యుడి నుంచి 2 సెంటీమీటర్ల దూరం పెరిగిందన్నారు. ఈ డ్యామ్ కారణంగా భూకంపాలు, పెను విపత్తులు సంభవిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 19, 2025
ఆ భయంతోనే ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి!

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయాడన్నారు.
News November 19, 2025
కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

శబరిమల యాత్రలో పేరూర్తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>
News November 19, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<


