News October 25, 2024
చనిపోయిన మెదడును తిరిగి బతికించిన చైనా వైద్యులు

చైనా పరిశోధకులు సరికొత్త ఘనత సాధించారు. చనిపోయి గంట గడచిన పంది మెదడును తిరిగి బతికించారు. దీని కోసం ‘ఎక్స్ వీవో బ్రెయిన్ మెయింటెనెన్స్’ అనే సాంకేతికతను వాడారు. గుండెపోటుతో మృతిచెందిన వారిని బతికించడంలో ఈ అధ్యయనం ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన వారిలో బ్రెయిన్కు రక్తం సరఫరా నిలిచిపోవడంతో మెదడు కణాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మరణం సంభవించడం వెనుక అది ప్రధాన కారణం.
Similar News
News November 26, 2025
నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<
News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


