News September 23, 2024
క్వాడ్ సదస్సుపై చైనా మీడియా అక్కసు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో క్వాడ్ దేశాల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో PM మోదీ, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు ఆంటోని ఆల్బనీస్, ఫుమియో కిషిదాలు హాజరయ్యారు. దీనిపై చైనా అధికారిక మీడియా అక్కసు వెళ్లగక్కింది. చైనాను నియంత్రించడంపై క్వాడ్ దృష్టి సారించిందని పేర్కొంది. చైనా, దాని పొరుగు దేశాల మధ్య విభేదాలను సృష్టించడానికి విభజించు, పాలించు వ్యూహాన్ని అమలు చేస్తోందని ఆరోపించింది.
Similar News
News September 23, 2024
షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లి షాపింగ్
భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఈ జంట పెళ్లి షాపింగ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ అయిన శ్రీకాంత్ ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో 25వ స్థానంలో ఉన్నారు. ఇటు శ్రావ్య ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ బంధువని తెలుస్తోంది.
News September 23, 2024
ఫ్రెంచ్ ఫ్రైస్ మహా ప్రమాదం: వైద్యులు
ఫ్రెంచ్ ఫ్రైస్కి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమ, మద్యపానం కంటే ఇవి మరింత డేంజర్ అని తెలిపారు. ‘ఆలూ అనేదే కార్బోహైడ్రేట్లతో కూడుకున్నది. మధుమేహ బాధితులకు అనారోగ్యకరం. ఇక ఆ ఫ్రైస్ను వేపిన నూనెను అప్పటికే ఎన్నిసార్లు వేడి చేసి ఉంటారో లెక్క కూడా ఉండదు. ఆ నూనెతో ఫ్రైస్లో ట్రాన్స్ఫ్యాట్స్ తీవ్రంగా పెరుగుతాయి. ఇవి గుండెకు అత్యంత ప్రమాదకరం’ అని హెచ్చరించారు.
News September 23, 2024
ఊహ తెలిశాక నాకు తెలిసిన హీరో ఆయనే: సాయి దుర్గ తేజ్
మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ రికార్డు దక్కడం పట్ల ఆయన మేనల్లుడు, నటుడు సాయి దుర్గ తేజ్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఊహ తెలిశాక తెలిసిన ఏకైక హీరో చిరంజీవి మాత్రమేనని ట్వీట్ చేశారు. ‘డాన్స్ అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే డాన్స్. ఆయన స్టెప్పులే నాకు తెలిసిన డాన్స్. ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడం అరుదైన ఘట్టం’ అని పేర్కొన్నారు.