News September 6, 2024

చిప్ తయారీ కంపెనీ పెడుతున్న అదానీ!

image

ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూప్ కలిసి భారత్‌లో చిప్ తయారీ కంపెనీని నెలకొల్పుతాయని తెలిసింది. రూ.83,947 కోట్ల పెట్టుబడితో నవీ ముంబైలో ఈ జాయింట్ వెంచర్‌ను నిర్మిస్తారని సమాచారం. మహారాష్ట్ర క్యాబినెట్ కమిటీ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు DyCM దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. ప్రాజెక్ట్ తొలి దశలో నెలకు 40వేలు, మొత్తం పూర్తయ్యాక 80వేల చిప్ వేఫర్స్ ఉత్పత్తి చేస్తారు.

Similar News

News October 26, 2025

తుఫాను వేళ ఎండ.. దేనికి సంకేతమో తెలుసా?

image

AP: ఇవాళ 8-9AM మధ్య పార్వతీపురం జిల్లాలో గరిష్ఠంగా 34.7, NTR జిల్లాలో 34.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయానికి మరో 2-3 డిగ్రీల టెంపరేచర్‌ పెరిగే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ఏపీకి 800 KM దూరంలో ఉండటంతో ఆ ప్రభావం ఇప్పుడే కనిపించదని, 300 KMల దగ్గరకు చేరగానే వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే భూమి వేడెక్కి తుఫాన్‌ ప్రభావం అధికమవుతుందని చెప్పారు.

News October 26, 2025

డాక్టర్ ఆత్మహత్య కేసు.. ప్రధాన నిందితుడు అరెస్టు

image

మహారాష్ట్రలోని సతారాలో SI తనను రేప్ చేశాడంటూ <<18091644>>డాక్టర్ ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ గోపాల్ బదానే అరెస్టయ్యారు. ఫల్టాన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి గోపాల్ లొంగిపోయారని ఎస్పీ తుషార్ దోషి తెలిపారు. అతడిని సతారా జిల్లా కోర్టులో హాజరుపరచగా 4 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. కాగా అంతకుముందు మరో నిందితుడు ప్రశాంత్ బంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News October 26, 2025

బ్రూక్ విధ్వంసం..

image

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ వన్ మ్యాన్ షో చూపించారు. ఇంగ్లండ్ 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్ అద్భుతమైన షాట్లతో 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు. 11 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో బ్రూక్ (135), ఓవర్టన్ (46) మాత్రమే రెండంకెల స్కోర్ చేయడం గమనార్హం.