News October 12, 2024

చంద్రబాబును కలిసి చెక్కులను అందించిన చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రూ.కోటి విరాళం అందజేశారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రాంచరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను ముఖ్యమంత్రికి ఇచ్చారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఈ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 12, 2024

ఈ విమాన ప్రయాణం ఒకటిన్నర నిమిషమే!

image

అత్యంత తక్కువ విమాన ప్రయాణ సమయమెంతో తెలుసా..? కేవలం ఒకటిన్నర నిమిషమే! స్కాట్లాండ్‌లోని ఓర్క్నీ దీవుల నుంచి పాపా వెస్ట్రే దీవుల మధ్య 1.7 మైళ్ల దూరం తిరిగే లోగన్‌ఎయిర్ విమానం ఆలోపే ప్రయాణికుల్ని గమ్యం చేరుస్తుంటుంది. ఈ రూట్‌లో స్టువర్ట్ లింక్‌లేటర్ అనే పైలట్ 53 సెకన్లలోనే ప్రయాణించి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ఈ ఫ్లైట్స్‌లో 10మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

News October 12, 2024

పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్

image

ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొత్తం 13,324 పంచాయతీల్లో రూ.4,500 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఇంకుడు గుంతలు, పశువుల శాలలు, రోడ్లు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

News October 12, 2024

HATSOFF: పొదల్లో పసిబిడ్డ.. దత్తత తీసుకున్న పోలీసు

image

అది యూపీలోని ఘజియాబాద్. పాపం ఇంకా కళ్లు కూడా తెరవని ఓ పసిగుడ్డును ఎవరో కఠినాత్ములు పొదల్లో వదిలేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకున్నారు. ఆ బుజ్జాయిని చూసి చలించిపోయారు. పెళ్లై ఆరేళ్లైనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ చంటిదాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.