News March 16, 2024
చిత్తూరు: సిట్టింగ్లకే అవకాశం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎంపీలకే వైసీపీ మరో అవకాశం ఇచ్చింది. తిరుపతి నుంచి గురుమూర్తి, చిత్తూరు నుంచి రెడ్డప్ప, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెడ్డప్ప 2019లో, గురుమూర్తి ఉపఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 2014, 19లో రాజంపేట MPగా ఎన్నికయ్యారు. ఆయన మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Similar News
News September 23, 2025
కాణిపాకం బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

చిత్తూరు జిల్లా కాణిపాకం బైపాస్ నాలుగు రోడ్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి మూర్తిగారి గ్రామవాసిగా స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 23, 2025
చిత్తూరు TDP అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ..?

జిల్లా TDP అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. B.చిట్టిబాబు, జయప్రకాష్ నాయుడు, P.విజయ్బాబు, హేమంబరధరావు, మహదేవ సందీప్ వంటి నేతలు బరిలో ఉన్నారు. మహిళా కోటాలో K.అరుణ ఉన్నారు. ఇక చిత్తూరు MLA నాయుడు సామాజిక వర్గ నేత కావడంతో బలిజ కోటాలో బాలాజీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. త్వరలోనే అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News September 23, 2025
డీఎస్సీ అభ్యర్థులు 24న తిరుపతి చేరుకోవాలి: డీఈవో

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోవాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు కాల్ లెటర్, ఆధార్ కార్డులతో రిపోర్టు చేయాలని సూచించారు. దుప్పటి, దిండు, గొడుగు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులకు, సహాయకులకు ఐడీ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఇందుకోసం ఫొటోలు తీసుకురావాలన్నారు.