News February 18, 2025

CHMD: కీలకంగా మారనున్న మండల ఓటర్లు

image

హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో 2,179 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలోనే అత్యధిక MLC ఓట్లు కలిగిన మండలంగా చిగురుమామిడి మండలం కీలకంగా మారనుంది. అయితే MLc అభ్యర్థుల దృష్టి ఈ మండలంపై ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇక్కడి ఓటర్లు ఎవరికీ పట్టం కడుతారో ఫిబ్రవరి 27వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Similar News

News March 12, 2025

KNR: సీలింగ్ ఫ్యాన్ పడి విద్యార్థినికి గాయాలు

image

పరీక్ష రాస్తుండగా విద్యార్థినిపై ఫ్యాన్ పడి గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ నగరంలోని సహస్ర జూనియర్ కాలేజీలో జరిగింది. నీలి శివాన్విత అనే ఇంటర్ సెంకడియర్ విద్యార్థిని పరీక్ష రాస్తోంది. ఈక్రమంలో సీలింగ్ ఫ్యాన్ ఆమె తలపై పడడంతో గాయాలయ్యాయి. నిర్వాహకులు ప్రథమ చికిత్స చేసి ఎగ్జామ్ రాయించారు. 

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. కరీంనగర్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని, వేసవిలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

News March 12, 2025

కరీంనగర్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన కరుణాకర్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ మండడం మహ్మాదాపూర్‌కి చెందిన నర్సింహాచాలి ఆనారోగ్యంతో ఉరేసుకున్నాడు. మానకొండూర్ మండలం పోచంపల్లికి చెందిన అంజయ్య మానసిక స్థితి సరిగా లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

error: Content is protected !!