News April 6, 2024

చోడ‘వరం’ దక్కేదెవరికి?

image

AP: అనకాపల్లి జిల్లాలోని చోడవరం ప్రజలు ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఇప్పటికి 6 పార్టీలను ఆదరించారు. 6సార్లు TDP, కాంగ్రెస్ 4సార్లు, కృషికార్, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, YCP ఒక్కోసారి గెలిచాయి. వైసీపీ నుంచి సిట్టింగ్ MLA కరణం ధర్మశ్రీ మరోసారి బరిలో దిగగా, టీడీపీ నుంచి కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు పోటీ చేస్తున్నారు. ఇరువురూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 9, 2024

డీఎస్సీ: ఎంత మంది ఎంపికయ్యారంటే?

image

TG: డీఎస్సీ పోస్టుల తుది ఫలితాలను విద్యాశాఖ రిలీజ్ చేసింది. మొత్తం 11 వేల 62 పోస్టులకు గానూ 10,006 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించింది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఆ పోస్టుల్లో ఎంపికైన క్యాండిడేట్లు కోర్టు కేసులు, ఇతర కారణాలు ఉండటంతో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది.

News October 9, 2024

గత నెల చరిత్రలో రెండో అత్యంత వేడైన సెప్టెంబర్‌: కోపర్నికస్

image

ఈ ఏడాది సెప్టెంబర్ చరిత్రలో రెండో అత్యంత వేడైన సెప్టెంబర్ అని EU వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్(C3S) తెలిపింది. అత్యంత వేడైన సెప్టెంబరు గత ఏడాది నమోదైందని గుర్తుచేసింది. గత నెలలో తీవ్ర వర్షపాతం, అమెరికాలో హెలీన్, తైవాన్‌లో క్రాతన్, యూరప్‌లో బోరిస్ తుఫాన్లు విధ్వంసాన్ని సృష్టించాయని వివరించింది. పర్యావరణ మార్పు కారణంగా పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

News October 9, 2024

ఓలాకు అండగా నిలిచిన హర్ష్ గోయెంకా

image

వివాదంలో చిక్కుకున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా అండగా నిలిచారు. తాను చిన్న దూరాలు ప్రయాణించేందుకు ఓలా స్కూటర్‌నే వినియోగిస్తానంటూ ట్వీట్ చేశారు. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు, ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్‌కు మధ్య నెట్టింట వాగ్వాదం అనంతరం కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(CCPA) ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు సంస్థ షేర్లు సైతం 9శాతం పడిపోయాయి.