News July 6, 2024
ఇండియన్ ఫ్యాన్స్ను చూసి ఆశ్చర్యపోయిన క్రిస్ లిన్
టీమ్ ఇండియా బస్ పరేడ్కు హాజరైన అభిమానులను చూసి ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానుల క్రేజ్ చూసి తనకు పిచ్చెక్కిందన్నట్లుగా ఎమోజీలతో లిన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్గా మారింది. కాగా క్రిస్ లిన్ ఐపీఎల్లో DC, SRH, MI, KKRకు ప్రాతినిధ్యం వహించారు. 42 మ్యాచులాడి 1329 పరుగులు చేశారు. ఆసీస్ తరఫున 4 వన్డేలు, 18 టీ20లు ఆడారు.
Similar News
News October 14, 2024
CATను ఆశ్రయించిన ఐఏఎస్లు
ఏపీ క్యాడర్ ఐఏఎస్లు ఆమ్రపాలి, కరుణ, వాణి ప్రసాద్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT)ను ఆశ్రయించారు. ఏపీకి వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని, TGలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. DOPT ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈనెల 16లోపు ఏపీలో రిపోర్టు చేయాలని వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
News October 14, 2024
స్పెషల్ బస్సుల్లోనే ధరలు పెంచాం: సజ్జనార్
బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. 2003లో జీవో- 16 ప్రకారం స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ‘రెగ్యులర్ సర్వీస్ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది. వీటిలో మాత్రమే ఛార్జీలు పెంచాం. మిగతా రోజుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి’ అని స్పష్టం చేశారు.
News October 14, 2024
ఇండియా-A కెప్టెన్గా తిలక్వర్మ
అక్టోబర్లో జరిగే ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో ఇండియా-A జట్టుకు హైదరాబాదీ క్రికెటర్ తిలక్వర్మ కెప్టెన్సీ చేయనున్నారు. అతడికి డిప్యూటీగా అగ్రెసివ్ ఓపెనర్ అభిషేక్శర్మ వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ ఒమన్ వేదికగా అక్టోబర్ 18-27 మధ్య జరగనుంది. గ్రూప్-Aలో బంగ్లాదేశ్-A, శ్రీలంక-A, అఫ్గానిస్థాన్-A, హాంకాంగ్ ఉండగా గ్రూప్-Bలో ఇండియా-A, పాకిస్థాన్-A, UAE, ఒమన్ ఉన్నాయి.