News March 10, 2025

విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు

image

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఉ.11 గంటలకు విజయవాడ ఆఫీస్‌కు విచారణకు రావాలని పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో కేవీ రావు ఫిర్యాదుతో 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద VSRకు నోటీసులు ఇచ్చారు. కాగా ఇటీవల విజయసాయి రాజ్యసభ ఎంపీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు.

Similar News

News December 6, 2025

రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

image

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్‌కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

News December 6, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలంటే?

image

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.

News December 6, 2025

భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఢిల్లీ<<>> మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 7 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, CS, IT, ఎలక్ట్రికల్), MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్‌కు నెలకు రూ.81,000, మేనేజర్‌కు రూ.97,320 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://backend.delhimetrorail.com