News January 21, 2025

అమరావతిలో CII సెంటర్ ఏర్పాటు: చంద్రబాబు

image

AP: టాటా సంస్థ సహకారంతో రాజధాని అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ట్రైనింగ్, అడ్వైజరీ సేవలతో ఇండస్ట్రీల్లో కాంపిటీషన్ పెంచుతాం. భారత్ 2047 విజన్ కోసం ముందుకు వెళ్తాం. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Similar News

News September 16, 2025

ఉద్యాన తోటల్లో రాగి లోప లక్షణాలు – నివారణ

image

రాగి లోపం వల్ల కొమ్మల చివర్ల నుంచి లేత ఆకులు రాలిపోతాయి. ఆకులు కిందకు వంగిపోతాయి. కాండము, కాయలు, ఆకులపై ఇటుక రంగు ఎండు మచ్చలు ఏర్పడతాయి. బొడిపెల్లాంటి మచ్చలు ఏర్పడి కాయల పరిమాణం తగ్గుతుంది. కాయల మధ్య బంక ఏర్పడుతుంది. కొమ్మల పైనుంచి కూడా బంక కారవచ్చు. రాగిధాతు నివారణ మందులను పిచికారీ చేసి.. కొన్ని శిలీంద్రాల ద్వారా వచ్చే తెగుళ్లతో పాటు పంటల్లో రాగిధాతు లోపాన్ని కూడా అరికట్టవచ్చు.

News September 16, 2025

శ్రీశైలంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసోత్సవాలు

image

AP: శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. OCT 24న మొదటి కార్తీక శుక్రవారం కృష్ణమ్మకు నది హారతి, NOV 1న గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం, 5న జ్వాలాతోరణం, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. శని, అది, సోమ, పౌర్ణమి రోజులలో సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నారు. సాధారణ రోజులలో పరిమితంగా అనుమతిస్తారు.

News September 16, 2025

కవిత రాజీనామా ఆమోదంపై సస్పెన్స్!

image

TG: బీఆర్ఎస్ మాజీ నేత కవిత MLC పదవికి రాజీనామా చేసి 2 వారాలు కావొస్తుంది. ఇప్పటికీ ఆమె రాజీనామాకు శాసనమండలి చైర్మన్ సుఖేందర్ ఆమోదం తెలపలేదు. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రాజీనామా ఆమోదంపై ఆయన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ లోపు కవితను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.