News January 21, 2025

అమరావతిలో CII సెంటర్ ఏర్పాటు: చంద్రబాబు

image

AP: టాటా సంస్థ సహకారంతో రాజధాని అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ట్రైనింగ్, అడ్వైజరీ సేవలతో ఇండస్ట్రీల్లో కాంపిటీషన్ పెంచుతాం. భారత్ 2047 విజన్ కోసం ముందుకు వెళ్తాం. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Similar News

News December 5, 2025

వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

image

☛ ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి.
☛ బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.

News December 5, 2025

స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్కడ?

image

తన వివాహం వాయిదా పడిన తర్వాత క్రికెటర్ స్మృతి మంధాన చేసిన తొలి ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. ఓ యాడ్ షూట్‌ వీడియోను ఆమె షేర్ చేయగా.. అందులో స్మృతి చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించకపోవడాన్ని ఫ్యాన్స్ గుర్తించారు. దీంతో ఉంగరం ఎక్కడుందని, పెళ్లి రద్దయిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ కొత్త వివాహ తేదీపై ప్రకటన చేయకపోవడం, రింగ్ తీసేయడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు.

News December 5, 2025

IndiGo సంక్షోభం.. బాధ్యత ఎవరిది?

image

కొత్త FDTL (Flight Duty Time Limitations) నిబంధనల అమలుతో <<18479258>>IndiGo<<>> తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పైలట్లకు వారానికి 48 గంటల రెస్ట్‌తో పాటు ఇతర పరిమితులతో సిబ్బంది కొరత తలెత్తింది. DGCA 18 నెలల గడువు ఇచ్చినా సంస్థ సిబ్బందిని నియమించుకోలేదని పైలట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల భద్రత కోసమే ప్రభుత్వం నియమాలు తీసుకువచ్చిందని.. విమానాల రద్దు, ఆలస్యానికి ప్రణాళిక లోపమే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.