News July 10, 2025
విశాఖలో CII పార్టనర్షిప్ సమ్మిట్

AP: నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సు సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో CS విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్లైన్ చేయాలన్నారు. సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్ను ఆదేశించారు.
Similar News
News July 10, 2025
సినిమా ఎఫెక్ట్.. ఇక బ్యాక్ బెంచర్లు ఉండరు!

ఫస్ట్ బెంచీ స్టూడెంట్స్ చురుకైనవారని, లాస్ట్ బెంచీ వారు అల్లరివారు, చదువురాదనే ధోరణి ఉంది. దానికి కేరళలోని పాఠశాలలు ‘U సీటింగ్ మోడల్’తో చెక్ పెడుతున్నాయి. మలయాళ సినిమా ‘స్థనార్థి శ్రీకుట్టన్’ స్ఫూర్తిగా బ్యాక్బెంచర్లు ఉండొద్దని అర్ధ వృత్తాకారంలో విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి. ఈ ‘U సీటింగ్’ అసమానతలను తొలగించి, అంతా సమానమనే ఆలోచన తీసుకొస్తుంది. మన దగ్గర ఇలా చేస్తే బాగుంటుంది కదా.
News July 10, 2025
ఎమర్జెన్సీపై శశి థరూర్ సంచలన కథనం

1975 ఎమర్జెన్సీని ఉద్దేశించి కాంగ్రెస్ MP శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో పాలన ప్రజలను భయంలోకి నెట్టి, అణచివేతకు గురిచేసిందని ఓ ఆర్టికల్లో పేర్కొన్నారు. భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికీ తెలియలేదన్నారు. అయినప్పటికీ ఆ చర్యలు జాతీయ ప్రయోజనాల కోసమని అప్పటి నాయకులు చెప్పుకొచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షకులు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికను ఎమర్జెన్సీ ఇచ్చిందన్నారు.
News July 10, 2025
టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్?

TG: ప్రభుత్వ బడుల్లో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేడు క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో ఈ విధానం సక్సెస్ అయిందని అధికారులు తెలిపారు. దీని ద్వారా టీచర్లు టైమ్కు స్కూల్కు వస్తారని, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు.