News September 19, 2024
5,600 మంది ఉద్యోగులపై ‘సిస్కో’ వేటు

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా 4వేల మంది ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజం సిస్కో మరో దశ లేఆఫ్స్కు సిద్ధమైంది. మొత్తం వర్క్ఫోర్స్లో 7 శాతం(5,600) సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అయితే ఏయే విభాగాలు ప్రభావితం అవుతాయో వెల్లడించలేదు. కాగా అక్కడ పని వాతావరణం ఏమాత్రం బాగాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఆ కంపెనీ వార్షిక ఆదాయం రికార్డు స్థాయిలో $54 బిలియన్లకు చేరింది.
Similar News
News December 6, 2025
‘మహానటి’ నుంచి ఈతరం ఏం నేర్చుకోవాలంటే?

మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంత స్టార్డమ్ వచ్చినా మూలాలను మర్చిపోకుండా సాధారణ నటిగానే మెలిగారు. ప్రత్యేక ఏర్పాట్లు, సెపరేట్ స్టాఫ్, అనవసరపు ఖర్చులతో ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలేదు. జూనియర్ ఆర్టిస్టులతో కలివిడిగా ఉండేవారు. యూనిట్ సభ్యులను బాగా చూసుకునే వారు. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. ఇవాళ సావిత్రి 90వ జయంతి.
News December 6, 2025
మే 17న JEE అడ్వాన్స్డ్

JEE అడ్వాన్స్డ్-2026 తేదీని IIT రూర్కీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది. 9AM నుంచి 12PM వరకు పేపర్-1, 2.30PM నుంచి 5.30PM వరకు పేపర్-2 ఉంటాయని వెల్లడించింది. పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. JEE మెయిన్లో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులు. JEE మెయిన్ సెషన్-1 జనవరిలో, సెషన్-2 ఏప్రిల్లో జరగనున్నాయి.
News December 6, 2025
ఉల్లి పండిన నేలలో మల్లీ పూస్తుంది..

ఉల్లి సాగు సాధారణంగా శ్రమతో కూడుకున్నది. కొన్నిసార్లు కన్నీళ్లతో (ఉల్లి కోసేటప్పుడు) ముడిపడి ఉంటుంది. అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్న నేలలో కూడా మంచి సస్యరక్షణ చేపడితే మల్లె వంటి సువాసనగల, అందమైన పంట పెరుగుతుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలతో కూడిన ఒక దశ ముగిసిన తర్వాత, అందమైన, సంతోషంతో కూడిన దశ ప్రారంభమవుతుందని, అంతా అయిపోయిన చోటు నుంచే కొత్త ఆశలు చిగురిస్తాయని ఈ సామెత అర్థం.


