News October 2, 2024

భారత పౌరులు అప్రమత్తంగా ఉండండి

image

ఇజ్రాయెల్‌‌పై ఇరాన్ క్షిపణి దాడులు, కీల‌క న‌గ‌ర‌మైన టెల్ ఆవీవ్‌లో సామూహిక కాల్పుల ఘ‌ట‌నల నేపథ్యంలో అక్కడి భారత పౌరులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఎంబసీ కోరింది. భార‌త పౌరులు జాగ్ర‌త‌గా ఉండాలని, స్థానిక అధికారులు సూచించిన విధంగా భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని సూచించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో 24×7 ఎంబ‌సీ హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించాల‌ని కోరింది.

Similar News

News October 2, 2024

నితీశ్ కుమార్ ఫిట్‌గా లేరు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా లేరని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో BJP తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నితీశ్‌కు ఆసరా ఇస్తోందని దుయ్య‌బట్టారు. ప్ర‌జా జీవితం నుంచి త‌ర‌చుగా ఆయ‌న గౌర్హాజ‌రు, భూ స‌ర్వే, వ‌ర‌ద‌లు, స్మార్ట్ మీట‌ర్ల బిగింపు వంటి కీల‌క విష‌యాల‌పై మౌనాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకొని నితీశ్ ఆరోగ్యాన్ని అంచ‌నా వేస్తున్నట్టు పేర్కొన్నారు.

News October 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 2, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:24 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:04 గంటలకు
ఇష: రాత్రి 7.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 2, 2024

ఇజ్రాయెల్‌లో టెర్రర్ ఎటాక్.. ఆరుగురు మృతి

image

ఇజ్రాయెల్‌లో ఇరాన్ క్షిపణి దాడులకు ముందు టెర్రర్ ఎటాక్ జరిగింది. టెల్ అవీవ్‌లో జరిగిన ఈ దాడిలో ఆరుగురు చనిపోగా, 12 మందికి గాయాలైనట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు.