News September 20, 2024
నేటి నుంచి సివిల్స్ మెయిన్స్

నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 ఉ.9 నుంచి మ.12 వరకు జరుగుతుంది. ఉ.8.30కు గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతించరు. హాల్ టికెట్, ఐడీ కార్డు కచ్చితంగా తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం ఉంటుంది.
Similar News
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
News November 25, 2025
హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్?

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు టాప్ హీరోల రెమ్యునరేషనే ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీనివల్లే బడ్జెట్ పెరుగుతోందని, పెట్టిన డబ్బులు రాబట్టేందుకు నిర్మాతలు ప్రేక్షకులపై టికెట్ల భారం మోపుతున్నారని చెబుతున్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లను కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?


