News October 25, 2024

ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన.. మార్నింగ్ వాక్‌కు గుడ్‌బై!

image

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్‌కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.

Similar News

News January 10, 2026

‘నాకు సంబంధం లేదు’.. మరి ఎవరది?

image

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు <<18810168>>అభ్యంతరం<<>>, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు <<18818989>>సంబంధం<<>> లేదని చెబుతున్నా అనుమతులు వస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి ‘రాజాసాబ్’, తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపునకు అనుమతి వచ్చింది. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనుమతిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో ఉండగా రేట్ల పెంపు ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారనే చర్చ మొదలైంది.

News January 10, 2026

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

image

ప్రపంచంలో ఎక్కువగా <<18798755>>చమురు<<>> ఉత్పత్తి చేసేది అమెరికానే. 2025లో రోజూ 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అమ్మింది. అయినా ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటోంది? తమ దగ్గర ఉత్పత్తి అయ్యే లైట్ క్రూడ్‌ విలువ ఎక్కువ కావడమే కారణం. తేలికపాటి ముడి చమురును అధిక ధరకు అమ్మి, హెవీ క్రూడ్‌ను తక్కువకే కొంటోంది. హెవీ క్రూడ్‌ను శుద్ధి చేసే రిఫైనరీలు USలో ఉండటం మరో కారణం. 2025లో 20L బ్యారెళ్లను కొనుగోలు చేసింది.

News January 10, 2026

1.75కోట్ల ఇన్‌స్టా యూజర్ల డేటా లీక్?

image

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్. సుమారు 1.75 కోట్ల మంది యూజర్ల సెన్సిటివ్ డేటా లీక్ అయినట్లు సైబర్ నిపుణులు వెల్లడించారు. యూజర్ల పేర్లు, మెయిల్స్, ఫోన్ నంబర్లు, అడ్రెస్‌లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు పేర్కొన్నారు. డేటా లీక్ వల్ల హ్యాకర్లు ఐడెంటిటీ థెఫ్ట్‌కు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యూజర్లు పాస్‌వర్డ్ మార్చుకోవాలని, ఇన్‌స్టా పేరుతో వస్తోన్న ఫేక్ మెయిల్స్ నమ్మొద్దని సూచించారు.