News October 25, 2024
ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన.. మార్నింగ్ వాక్కు గుడ్బై!
ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.
Similar News
News October 25, 2024
సంచలనం: 52కు 2 వికెట్లు.. 53కు ఆలౌట్
ఆస్ట్రేలియా వన్డే కప్లో సంచలనం నమోదైంది. టాస్మానియాపై వెస్ట్రన్ ఆస్ట్రేలియా 1 రన్ తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 52/2 ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా 53కే ఆలౌటైంది. టాస్మానియా బౌలర్ బ్యూ వెబ్స్టర్ (5 వికెట్లు) ధాటికి ఆ జట్టు ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ జట్టులో బాన్క్రాఫ్ట్, ఇంగ్లిస్, టర్నర్, కనోల్లీ, కార్ట్రైట్, అగర్, రిచర్డ్సన్, మోరిస్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లుండటం విశేషం.
News October 25, 2024
హమాస్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కైరోలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో మొస్సాద్ చీఫ్ డేవిడ్ బోర్నియా కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ చర్చలకు యూఎస్, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరుదేశాలు కాల్పులను విరమిస్తాయని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్పై యుద్ధం చేసేందుకే ఇరాన్ మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News October 25, 2024
అనుభవం నుంచి వచ్చిన ఆలోచనతో..!
దీపావళికి సొంతూరుకు వెళ్లేందుకు బస్సు టికెట్ లభించకపోవడంతో ఇబ్బంది పడిన ఓ యువకుడికి వచ్చిన ఆలోచన రూ.వేల కోట్లకు అధిపతిని చేసింది. నిజామాబాద్కు చెందిన ఫణీంద్ర సామ అనే వ్యక్తి బస్ స్టాండ్కి వెళ్లగా సీటు లభించకపోవడంతో ఆగిపోయాడు. దీంతో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంటే ఎందరికో ఉపయోగపడుతుందని భావించి RedBusను స్టార్ట్ చేశారు. తొలుత ఇబ్బందులు ఏర్పడినా ఎదుర్కొని ముందుకెళ్లి విజయం సాధించారు.