News August 20, 2024
1973 నాటి భయంకర ఘటనను గుర్తు చేసిన సీజేఐ

కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణ సమయంలో వైద్య రంగంలో ఘోరమైన ఘటన అంటూ అరుణా షాన్బాగ్ స్టోరీని CJI డీవై చంద్రచూడ్ ప్రస్తావించారు. ముంబైలోని KEM ఆస్పత్రిలో 1973 NOV 27 రాత్రి నర్స్ అరుణపై వార్డ్బాయ్ అత్యాచారం చేశాడు. కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు. దీంతో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు దెబ్బతిన్నాయి. ఆపై 42 ఏళ్ల పాటు కోమాలోనే ఉన్న ఆమె 2015లో మృతి చెందారు.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


