News January 20, 2025
పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందో లేదో స్పష్టత రావాలి: DGP

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కలకలంపై DGP ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ ఎగిరిందో లేదా స్పష్టత రావాల్సి ఉందని, సాయంత్రానికి విచారణ కొలిక్కి వస్తుందన్నారు. RSI మాత్రమే డ్రోన్ ఎగిరినట్టు చెబుతున్నారని వెల్లడించారు. పవన్ సాలూరు పర్యటనలో నకిలీ IPS అధికారి ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని DGP వివరించారు. ఆయన భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
Similar News
News December 10, 2025
దేవుడిని నిందించడం తగునా?

కొందరికి సంపదలు, మరికొందరికి దారిద్ర్యం ఉండటానికి భగవంతుడే కారణమని చాలామంది అనుకుంటారు. కానీ, మన జీవితంలోని లోటుపాట్లకు మనమే బాధ్యులం. మనిషి జీవితం ఈ ఒక్క జన్మకే పరిమితం కాదని, నూరు జన్మల కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవిస్తామని శాస్త్రాలు చెబుతాయి. ‘భగవంతుడు అందరిపై సమాన అనుకూలతలు కల్పిస్తాడు. జీవులు తమ స్వభావం, కర్మలకు అనుగుణంగా ఎదుగుతారు. దుష్కర్మలు చేసి, దేవుడిని నిందించడం తప్పు’ అని పేర్కొంటాయి.
News December 10, 2025
ప్రేమ పేరుతో మోసం చేసిందని మహిళా డీఎస్పీపై ఫిర్యాదు

రాయ్పూర్ డీఎస్పీ కల్పన వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బిజినెస్మ్యాన్ దీపక్ టాండన్ కేసు పెట్టారు. 2021లో ప్రేమ పేరుతో రిలేషన్షిప్లోకి దింపి, బ్లాక్మెయిల్ చేసి తన నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, కారు, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్, తన హోటల్ ఓనర్షిప్ రాయించుకున్నట్టు ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను కల్పన వర్మ ఖండించారు.
News December 10, 2025
ఇండిగో ఎఫెక్ట్.. ఢిల్లీ ఎకానమీకి రూ.1000 కోట్ల నష్టం

ఇండిగో సంక్షోభంతో ఢిల్లీలోని పలు వ్యాపార రంగాలు రూ.1000 కోట్లు నష్టపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ట్రేడర్స్, టూరిస్ట్స్, బిజినెస్ ట్రావెలర్స్ తగ్గారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయన్నారు. ఆటో మొబైల్స్, హోమ్ నీడ్స్, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరవయ్యారని తెలిపారు.


