News October 5, 2024

రూ.150 కోసం ఫ్రెండ్స్ మధ్య ఘర్షణ.. వ్యక్తి మృతి

image

AP: కృష్ణా(D) కంకిపాడు(M) ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రూ.150 నగదు విషయంలో స్నేహితులు భుజంగరావు, వెంకటస్వామి మధ్య గొడవ ఏర్పడింది. వెంకటస్వామి ఆగ్రహంతో భుజంగరావు గుండెపై గట్టిగా కొట్టారు. అతను గతేడాదే హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

కుడి ఎడమైతే.. మెదడుకు మంచిదే

image

ప్రతిరోజూ కుడి చేతితో చేసే పనులను ఎడమ చేత్తో చేస్తే మెదడు చురుగ్గా మారుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ స్టడీలో వెల్లడైంది. కుడి చేతితో చేసే పనికి ఎడమ చేతిని ఉపయోగిస్తే మెదడు చురుకుదనం, ఏకాగ్రత, మెమొరీ పెరుగుతాయి. రెగ్యులర్‌గా కుడి చేతితో చేసే బ్రషింగ్‌కు ఎడమ చేతిని ఉపయోగించండి. ఇలా చేస్తే చిన్న చిన్న సవాళ్లను ఇష్టపడే మెదడులో కొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయి. దీనినే న్యూరో ప్లాస్టిసిటీ అంటారు.

News November 25, 2025

అతి సన్నని వరి వంగడం త్వరలో విడుదల

image

సన్న వరి రకాలకు డిమాండ్ దృష్ట్యా, అత్యంత నాణ్యత గల అతి సన్నని వరి వంగడం ‘MTU 1426’ను మార్టేరు వరి పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. ఇది రబీకి అనుకూలం. పంటకాలం 125 రోజులు. కాండం దృఢంగా ఉండి, చేనుపై పడిపోదు. దిగుబడి హెక్టారుకు 6.5- 7 టన్నులు. ఇది తొలి ఏడాది చిరు సంచుల ప్రదర్శనలో మంచి ఫలితాలనిచ్చింది. మరో 2 ఏళ్లు పరిశీలించి ఫలితాల ఆధారంగా విడుదల చేస్తారు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 25, 2025

విషతుల్యమవుతున్న తల్లిపాలు

image

తల్లిపాలు స్వచ్ఛమైనవి, కల్తీలేనివని మనం అనుకుంటాం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్ అవశేషాలున్నట్లు గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా బిహార్‌లో చేసిన ఓ పరిశోధనలో తల్లిపాలలో యురేనియం అవశేషాలున్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే మానవ మనుగడే కష్టం అంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా మేలుకొని పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.