News October 16, 2024
ఇంటర్ విద్యార్థులకు సా.5 వరకు తరగతులు

AP: రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సా.4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా సాయంత్రం 5 గంటలకు పొడిగించాలని తెలిపింది. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
Similar News
News December 10, 2025
బుమ్రా 100వ వికెట్పై SMలో చర్చ!

SAపై తొలి T20లో బ్రెవిస్ వికెట్ తీసిన బుమ్రా 3 ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వికెట్పై SMలో చర్చ నడుస్తోంది. బుమ్రా నో బాల్ వేశారని, థర్డ్ అంపైర్ కూడా సరైన నిర్ణయం ఇవ్వలేదని కొందరు అంటున్నారు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో నిర్ణయం బౌలర్కు అనుకూలంగా ఉంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అది గుడ్ బాలా? నో బాలా? COMMENT.
News December 10, 2025
డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు

1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
– అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
News December 10, 2025
3రోజుల పాటు AP ఛాంబర్స్ బిజినెస్ EXPO

యువత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు AP ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. VJAలో ఈ నెల 12,13,14 తేదీల్లో జరిగే EXPOలో మంత్రులు పాల్గొంటారన్నారు. MSME, టూరిజం, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మహిళ సాధికారతపై సెమినార్లు ఉంటాయని చెప్పారు. 160స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎంట్రీ ఉచితమన్నారు.


