News October 16, 2024
ఇంటర్ విద్యార్థులకు సా.5 వరకు తరగతులు

AP: రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సా.4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా సాయంత్రం 5 గంటలకు పొడిగించాలని తెలిపింది. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
Similar News
News December 12, 2025
ఐరాస అత్యున్నత పురస్కారం అందుకున్న IAS అధికారిణి సుప్రియా సాహూ

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025’ అవార్డు అందుకున్నారు. తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో పాటు బ్లూ మౌంటెయిన్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మౌంటెయిన్స్ 2002 వంటివి ఆమె చేపట్టారు.
News December 12, 2025
తారస్థాయికి కూటమి అరాచక పాలన: అనిల్

AP: పోలీసులను అడ్డుపెట్టుకుని TDP రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్లో ఆరోపించారు. ‘కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీతో సంబంధంలేని మేయర్పై అవిశ్వాసం పెట్టి YSRCPపై ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండి.. సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు చేస్తోంది’ అని విమర్శించారు.
News December 12, 2025
ఇండిగోకు మరో దెబ్బ.. రూ.58.75 కోట్ల ట్యాక్స్ నోటీస్

విమానయాన సంస్థ ఇండిగోకు రూ.58.75 కోట్ల ట్యాక్స్ పెనాల్టీ నోటీసును ఢిల్లీ సౌత్ కమిషనరేట్లోని సెంట్రల్ GST అదనపు కమిషనర్ జారీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇండిగో స్పందిస్తూ.. వివరాలను పరిశీలిస్తున్నామని అవసరమైతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపింది. ఇటీవల విమానాల రద్దు, ఆలస్యాల వివాదం మధ్య ఈ నోటీసు రావడం ఆ సంస్థపై మరింత ఒత్తిడి పెంచింది.


