News August 22, 2024
వెంటనే వర్గీకరణ చేయాలి: మందకృష్ణ

తెలంగాణలో వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని HYDలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ‘కోర్టు ఇచ్చిన తీర్పుతో 30 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటం సాకారం అయ్యింది. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి’ అని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 30, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో అప్రెంటిస్ పోస్టులు

CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ 14 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అర్హతల వారు జనవరి 8న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్ (NATS)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లొమా అప్రెంటిస్లు 18-24ఏళ్ల మధ్య, డిగ్రీ అప్రెంటిస్లు 21 నుంచి 26ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://www.nio.res.in
News December 30, 2025
ప్రియాంకా గాంధీ కుమారుడితో ఎంగేజ్మెంట్.. ఎవరీ అవివా బేగ్?

ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రాతో ఎంగేజ్మెంట్ వార్తలతో అవివా బేగ్ పేరు ఇప్పుడు SMలో మారుమోగుతోంది. ఢిల్లీకి చెందిన ఆమె ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. జర్నలిజం చదివిన అవివా ‘అటెలియర్ 11’ అనే ఫొటోగ్రఫీ స్టూడియోను నడుపుతున్నారు. సామాన్య ప్రజల జీవనశైలిని తన కెమెరాలో బంధించడంలో ఆమెది ప్రత్యేక శైలి. పలు ఆర్ట్ గ్యాలరీల్లో ఫొటోలను ప్రదర్శించిన అవివా.. వెర్వ్ వంటి పాపులర్ మ్యాగజైన్లలో కూడా పనిచేశారు.
News December 30, 2025
తెలంగాణలో క్రైమ్ రేట్ తగ్గింది: DGP

TG: పోలీస్ వార్షిక నివేదిక-2025ను DGP శివధర్రెడ్డి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే క్రైమ్రేట్ 2.33% తగ్గిందని వెల్లడించారు. 2025లో 782 హత్యలు జరిగాయని తెలిపారు. పోలీసులు సేవాభావంతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఈ ఏడాది 509మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా అల్లర్లు లేకుండా నిర్వహించామని, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, మెస్సీ పర్యటన విజయవంతమయ్యాయని వివరించారు.


