News August 22, 2024
వెంటనే వర్గీకరణ చేయాలి: మందకృష్ణ

తెలంగాణలో వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని HYDలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ‘కోర్టు ఇచ్చిన తీర్పుతో 30 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటం సాకారం అయ్యింది. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి’ అని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 11, 2025
భారత వాతావరణశాఖలో 134 పోస్టులు.. అప్లై చేశారా?

భారత వాతావరణ శాఖ(<
News December 11, 2025
సెకండరీ డిస్మెనోరియాని ఎలా గుర్తించాలంటే?

ప్రైమరీ డిస్మెనోరియా అంటే రజస్వల అయినప్పటి నుంచి పీరియడ్స్ రెండు రోజుల్లోనే నొప్పి ఉంటుంది. కానీ సెకండరీ డిస్మెనోరియాలో నెలసరికి ముందు, తర్వాత కూడా తీవ్రంగా నొప్పి వస్తుంది. దీంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి, బ్లీడింగ్లో మార్పులు ఉంటాయి. కాబట్టి సెకండరీ డిస్మెనోరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 11, 2025
కోనేటి రాయడి కునుకు కొద్దిసేపే.. అదీ మన కోసమే!

1933కి ముందు శ్రీవారికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భక్తుల సంఖ్య పెరగడంతో స్వామివారి విశ్రాంతి సమయం తగ్గిపోయింది. ఒకప్పుడు పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామి నేడు అర్ధరాత్రి దాటినా భక్తుల మొర వింటున్నాడు. ఏడు కొండలు ఎక్కిన మనకు సంతోషాన్ని పంచడానికి ఆ ఏడు కొండలవాడు అలుపు లేకుండా దర్శనమిస్తున్నాడు. ఇంతటి కరుణ చూపే స్వామీ.. నీకెప్పుడూ రుణపడి ఉంటాం!


