News September 22, 2025
స్వచ్ఛమైన ప్రకృతి వనరులను అందించాలి: పవన్

AP: పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకెళ్లాలని Dy.CM పవన్ పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శితో ఆయన భేటీ అయ్యారు. ‘కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలి. మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు అర్థమయ్యేలా సమగ్ర నివేదిక సిద్ధం చేయండి. సాధ్యమైనంత స్వచ్ఛంగా ప్రకృతి వనరులను భావి తరాలకు అందించే లక్ష్యంతో పని చేయాలి’ అని దిశానిర్దేశం చేశారు.
Similar News
News September 22, 2025
యూరియాతో తీవ్ర నష్టం: సీఎం

AP: యూరియా ఎక్కువగా వాడటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాల్సి ఉంది. బాధ్యతలేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.
News September 22, 2025
INDvsPAK: మరోసారి ICCకి PCB ఫిర్యాదు!

భారత్, పాక్ మ్యాచ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ను <<17794224>>ఔట్గా<<>> ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించినట్లు సమాచారం. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు పాక్ మీడియా పేర్కొంది. కాగా అంతకుముందు హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో రిఫరీ పైక్రాఫ్ట్పై PCB <<17717948>>ఫిర్యాదు<<>> చేసి భంగపడిన విషయం తెలిసిందే.
News September 22, 2025
TGPSCకి ముగ్గురు కొత్త సభ్యులు

TGPSCకి కొత్తగా ముగ్గురు సభ్యులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ L.B.లక్ష్మీకాంత్ రాథోడ్లను సభ్యులుగా నియమించింది. వీరు ఆరేళ్ల పాటు లేదా వారికి 62 ఏళ్లు వచ్చేంత వరకు పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది.