News May 30, 2024
ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం: ఖర్గే
ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో 421 సార్లు మత, విభజన వాద వ్యాఖ్యలు చేశారు. కులమతాల ఆధారంగా ఓట్లు అభ్యర్థించకూడదని ఈసీ నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘించారు. 758 సార్లు తన సొంత పేరే తలుచుకున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.
Similar News
News October 14, 2024
ఎన్నికల కోసమే ట్రూడో ‘అనుమానిత’ స్టంట్
కెనడాలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ట్రూడో ప్రభుత్వం నిజ్జర్ హత్యను ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెనడాలో ఇటీవల జీవన వ్యయాలు భారీగా పెరగడంతో స్థానికుల్లో అసంతృప్తి ఉంది. ట్రూడో ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలు తేల్చాయి. దీంతో ప్రాబల్యం ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాదుల మద్దతు కోసమే నిజ్జర్ హత్యను ట్రూడో రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి.
News October 14, 2024
ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్
నిజ్జర్ హత్య కేసులో కెనడా దుందుడుకు ప్రయత్నాలపై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఆరుగురు కెనడా దౌత్యవేతలను బహిష్కరించింది. భారత్లో కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హైకమిషనర్ పాట్రిక్ హెబర్ట్ సహా నలుగురు కార్యదర్శులను బహిష్కరిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వీరందర్నీ అక్టోబర్ 19న రాత్రి 11.59 గంటలలోపు భారత్ వీడి వెళ్లాలని ఆదేశించింది.
News October 14, 2024
పాక్ ఘోర ఓటమి.. భారత్కు బిగ్ షాక్
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు పోరాటం ముగిసింది. న్యూజిలాండ్ చేతిలో 54 రన్స్ తేడాతో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. దీంతో భారత్, పాక్ టోర్నీ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. 111 రన్స్ టార్గెట్తో ఛేజింగ్కు దిగిన పాక్ 11.4 ఓవర్లలో 56 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కాగా గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్లో పాగా వేయగా తాజాగా న్యూజిలాండ్ బెర్తు ఖరారు చేసుకుంది.