News March 21, 2025

CMను కలిసిన అనంత దళిత ఎమ్మెల్యేలు

image

అమరావతిలో సీఎం చంద్రబాబును శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులందరికీ సమాన న్యాయం చేకూరాలనే ఉక్కు సంకల్పంతో చంద్రబాబు గతంలో చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి దళిత శాసనసభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Similar News

News March 21, 2025

ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర కలవరింతలు, ఫిట్స్, లేదా పూర్తి అపస్మారక స్థితి ఉంటుందని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని అన్నారు. తలకు టోపి పెట్టుకోవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలని సూచించారు.

News March 21, 2025

అనంత జిల్లాలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నట్లు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు తెలిపారు. 5 రోజులలో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. 14న 40.4°, 15న 39.8°, 16న 39.2°, 17న 40.7°, 18న 39.2°, 1940.7°, 20న 41.1° డిగ్రీలు నమోదు అయ్యాయని వివరించారు. వేసవి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News March 21, 2025

ప్రేమ విఫలం.. ధర్మవరంలో యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలమైందని ధర్మవరం పట్టణం గిర్రాజు కాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్(35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందిన వివరాల మేరకు.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. నిరాకరించిందని మనస్తాపం చెంది గురువారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓబునాథ్ టైల్స్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!