News August 17, 2024
CM చంద్రబాబు శ్రీసిటీ పర్యటన షెడ్యూల్

CM చంద్రబాబు శ్రీసిటీ పర్యటన షెడ్యూలు ఖరారు అయ్యింది. ఆగస్టు 19వ మధ్యాహ్నం 12 గంటలకు CM.చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీ హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా 12-05 గంటలకు శ్రీసిటీ బిజినెస్ సెంటర్కు చేరుకుంటారు. 12-50 వరకు పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు. 1-2 గంటల వరకు ఫోక్స్ కాన్ గ్లోబల్ CEOలతో సమావేశం నిర్వహిస్తారు. 2:30కు శ్రీసిటీ నుంచి హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
Similar News
News November 24, 2025
చిత్తూరు: మట్టి కోసం TDP పరువు తీసేస్తున్నారు..!

చిత్తూరు జిల్లాలో గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. పూతలపట్టులో గ్రావెల్ తరలింపు విషయంలో TDP నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారట. ఇదే విషయమై ఐరాలకు చెందిన ఓ TDP కార్యకర్త ఆడియో వైరల్గా మారింది. గ్రావెల్ విషయమై TDPలో వర్గాలు ఏర్పడినా MLA మౌనంగా ఉండటాన్ని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారట. తిరుపతి జిల్లాలోనూ <<18368996>>గ్రావెల్ <<>>తరలింపు జోరుగా జరుగుతోంది.
News November 23, 2025
చిత్తూరు జిల్లా అధికారులకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలని డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ వారి ముందస్తు అనుమతి లేకుండా సబార్డినేట్ అధికారులను డిప్యూట్ చేయకూడదన్నారు. ఈ పీజేఆర్ఎస్ నిర్వహణపై కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి ఇప్పటికే అత్యవసర సందేశాన్ని పంపినట్లు డీఆర్వో వివరించారు.
News November 23, 2025
చిత్తూరు కలెక్టరేట్లో రేపు గ్రీవెన్స్ డే

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


