News March 19, 2025

CM తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరుతారు. రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.

Similar News

News October 19, 2025

వైసీపీ NTR జిల్లా అధికార ప్రతినిధిగా గుంజ శ్రీనివాసు

image

వైసీపీ NTR జిల్లా అధికార ప్రతినిధిగా కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేశ్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ సిఫార్సుల మేరకు వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.

News October 19, 2025

పోలవరంలో అత్యధిక వర్షపాతం నమోదు

image

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా పోలవరంలో 104.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పెదవేగిలో 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లి 101.2, బుట్టాయిగూడెం 85.4, ఏలూరు 84.8, జంగారెడ్డిగూడెం 80.4, నిడమర్రు 80.2, కొయ్యలగూడెం 79.8, ద్వారకాతిరుమల 73.0, భీమడోలు 49.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.

News October 19, 2025

గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

image

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.