News March 19, 2025

CM తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరుతారు. రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.

Similar News

News April 23, 2025

BRS పేరు మారుస్తారా? KTR ఏమన్నారంటే?

image

TG: BRS పేరు మార్చాల్సిన అవసరం లేదని, తీరు మార్చుకోవాలని KTR ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. KCR లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్నారు. KCR కాకుండా తనకు నచ్చిన CM పినరయి విజయన్(కేరళ) అని తెలిపారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, పవన్ కళ్యాణ్ తాను ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. మోదీ మతపరమైన అజెండాను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటివరకు PMగా చేసిందేం లేదని అభిప్రాయపడ్డారు.

News April 23, 2025

10th RESULTS: హ్యాట్రిక్ కొట్టిన పార్వతీపురం మన్యం జిల్లా

image

పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలించింది.
➤ 2022-23 విద్యా సంవత్సరంలో 10,694 మంది పరీక్ష రాయగా 9,356(87.4%) మంది పాసయ్యారు
➤ 2023-24 విద్యా సంవత్సంలో 10,443 మంది పరీక్షకు హాజరవ్వగా 10,064(96.37%) మంది ఉత్తీర్ణత సాధించారు
➤ ఈఏడాది(2024-25) 10,286 మంది పరీక్ష రాయగా 9,659 (93.90%) మంది పాసయ్యారు.

News April 23, 2025

టెన్త్‌లో RECORD: 600కు 600 మార్కులు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. పదో తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*Congratulations Nehanjani Yalla

error: Content is protected !!