News November 8, 2024
CM, పవన్పై అసభ్య పోస్టులు.. ఒకరి అరెస్ట్

సీఎం చంద్రబాబు, DY CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్పై అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన యువకుడు అరెస్ట్ అయిన ఘటన ఉమ్మడి ప.గో జిల్లాలో వెలుగు చూసింది. గోపాలపురం SI సతీశ్ కుమార్ వివరాల ప్రకారం.. రంగంపేట మండలానికి చెందిన వీరాబత్తుల చంద్రశేఖర్ సోషల్ మీడియాలో సీఎం, పవన్, ఇతర మంత్రుల
ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. పార్టీల మధ్య విభేదాలు, కార్యకర్తల మధ్య గొడవలు వచ్చేలా పోస్టులు పెట్టడంతో గురువారం అరెస్ట్ చేశారు.
Similar News
News December 7, 2025
భీమవరం: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 7, 2025
HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.
News December 7, 2025
ప.గో: YCPకి జిల్లా కీలక నేత రాజీనామా..!

తాడేపల్లిగూడెంకు చెందిన వైసీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తెన్నేటి జగ్జీవన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపినట్లు జగ్జీవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వైసీపీలో నెలకొన్న పరిణామాలు, పార్టీ విధానాలు, గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.


