News August 5, 2024
CM సమావేశంలో పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్

రాజధాని అమరావతి సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. పలు అంశాలపై సీఎం కలెక్టర్లకు సూచనలు చేశారు.
Similar News
News December 15, 2025
కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సభా భవన్లో జరిగే కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చునన్నారు. కలెక్టరేట్తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరుగుతుందన్నారు.
News December 15, 2025
కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సభా భవన్లో జరిగే కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చునన్నారు. కలెక్టరేట్తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరుగుతుందన్నారు.
News December 14, 2025
కడప జిల్లాలో పలువు సీఐల బదిలీ

కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జోన్లో మొత్తం 31 మంది సీఐలను ఆయన బదిలీ చేశారు. ప్రొద్దుటూరు టూటౌన్ సదాశివయ్య, త్రీటౌన్ వేణుగోపాల్, కడప వీఆర్ మోహన్, కమలాపురం రోషన్, ముద్దనూరు దస్తగిరి, కడప వీఆర్ నారాయణప్ప, కడప CCS కృష్ణంరాజు, LR పల్లె కొండారెడ్డి, కడప టూటౌన్ సుబ్బారావు ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ అయ్యారు.


