News October 9, 2025
CM చంద్రబాబు పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధత.?

CM చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోపాటు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చెయ్యాలి. ఈ క్రమంలో జిల్లా అధికారులు హెలిపాడ్ను సైతం సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు సీఎం పర్యటన అధికారకంగా ఖరారు కాలేదు. నెల్లూరులో అడపదడప కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 9, 2025
CM నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మ. 2.25 గంటలకు ఆయన కోవూరు(M) పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా మైపాడు గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ను ప్రారంభిస్తారు. షాపు ఓనర్లతో ఫొటోషూట్ అనంతరం 3.05 నిముషాలకు తిరిగి పోతిరెడ్డి పాలెం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఈదగాలి వెళ్తారు.
News October 9, 2025
CM నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మ. 2.25 గంటలకు ఆయన కోవూరు(M) పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా మైపాడు గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ను ప్రారంభిస్తారు. షాపు ఓనర్లతో ఫొటోషూట్ అనంతరం 3.05 నిముషాలకు తిరిగి పోతిరెడ్డి పాలెం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఈదగాలి వెళ్తారు.
News October 9, 2025
ఇండస్ట్రియల్ హబ్గా కరేడు: కలెక్టర్ హిమాన్షు

పోర్టు ఆధారిత పరిశ్రమల రాకతో కరేడు గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మొత్తం 4,800 ఎకరాల భూసేకరణ అవసరం కాగా ఇప్పటివరకు 515 ఎకరాలకు సంబంధించి రైతులకు అవార్డు పాస్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.