News March 19, 2025
CM తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇదే..!

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరుతారు. రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్కు వెళ్తారు.
Similar News
News December 16, 2025
ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు?

TG: వచ్చే ఏడాది APR నుంచి పెన్షన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధ్యాప్య, వితంతు తదితర పెన్షనర్లు 44లక్షల మంది ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వారికోసం ₹11,635Cr కేటాయించింది. పెంపు జరిగితే ₹22K Cr కావాల్సి ఉండగా నిధుల సమీకరణ మార్గాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఒకేసారి పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయనుంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ ₹2,016 ఇస్తుండగా హామీ మేరకు ₹4వేలు చేయాల్సి ఉంది.
News December 16, 2025
ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి విడత నిర్వహణను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని ఆర్ఓలు, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీఓ, ఇతర అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత విడతల్లో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకూడదని ఆదేశించారు.
News December 16, 2025
ASF: 4 మండలాల్లో 938 పోలింగ్ బూత్లు

ఆసిఫాబాద్ జిల్లాలో చివరి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్ నగర్ మండలాలలో 104 సర్పంచ్, 744 వార్డు స్థానాలకు 938 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


