News October 29, 2025

CM సమాయత్తం చేసిన తీరు అద్భుతం: సత్యకుమార్

image

NTR జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తుపానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సీఎం అద్భుతంగా సమాయత్తం చేశారని ఆయన అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి సహాయక చర్యలను మంత్రి పర్యవేక్షించారు. యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి, అన్ని విధాలుగా సంసిద్ధుల్ని చేశారని చెప్పారు.

Similar News

News October 30, 2025

మెదక్: మహిళపై దాడి, దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

image

మెదక్ జిల్లాలో మహిళపై దాడి, దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు లాక్కొని, అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు పకీరా నాయక్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిందని పేర్కొన్నారు. నిందితుడికి గతంలోనే వేరే కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.

News October 30, 2025

హుజూర్‌నగర్‌కు మూడు పేర్లు

image

హుజూర్‌నగర్‌కు పాతకాలంలో పురుషోత్తమపురి, పోంచర్ల అనే రెండు పేర్లు ఉండేవి. ఫణిగిరి గుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి వెలయడంతో ఈ ప్రాంతం పురుషోత్తమపురిగా పేరొందింది. ఆ తర్వాత ముత్యాలమ్మ (పోచమ్మ) దేవాలయం ఏర్పడటంతో పోంచర్లగా మారింది. నవాబుల పాలనలో దీనిని హుజూర్‌నగర్‌గా మార్చారు. ఈ రెండు ఆలయాలు నేటికీ ఈ ప్రాంత ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉన్నాయి.

News October 30, 2025

జనగామ: నేడు పాఠశాలలకు సెలవు

image

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తూ జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రేపు జరగాల్సిన ఎస్ఏ-1 పరీక్షలు నవంబరు 1వ తేదీన నిర్వహించాలని ఆయా పాఠశాలల నిర్వాహకులను ఆదేశించారు.