News January 23, 2025
APలో చిప్ డిజైన్ కేంద్రం పెట్టాలని గూగుల్కు CM విజ్ఞప్తి

విశాఖలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ను CM CBN కోరారు. సర్వర్ల నిర్వహణలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని ఆ సంస్థ క్లౌడ్ CEO థామస్ కురియన్ను రిక్వెస్ట్ చేశారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని DP వరల్డ్ సంస్థను, విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకోవాలని పెప్సికోను కోరారు. APని ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేలా సహకరించాలని బిల్ గేట్స్కు CM విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 25, 2025
బంగ్లాదేశ్లో హిందువుల ఇళ్లకు నిప్పు..

బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో 7 హిందూ కుటుంబాలపై <<18670618>>నిరసనకారులు<<>> దాడి చేసినట్టు తెలుస్తోంది. 2 ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 8 మంది త్రుటిలో తప్పించుకున్నారు. ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం కూడా హిందువుల ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు.
News December 25, 2025
శివాజీ వ్యాఖ్యల వివాదం.. అనసూయ వార్నింగ్

TG: శివాజీ వివాదాస్పద <<18666465>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో నటి అనసూయ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్-19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన <
News December 25, 2025
తిరుమలలో RSS చీఫ్..

తిరుపతిలోని సప్త గో ప్రదక్షిణశాలను RSS చీఫ్ మోహన్ భాగవత్ ఇవాళ సందర్శించారు. హిందూ సంప్రదాయంలో గోపూజకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భోజనం చేశారు. తిరుపతిలోని నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి 4 రోజులపాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యేందుకు ఆయన తిరుపతి చేరుకున్నారు.


