News July 30, 2024

ఆగస్టు 1న సత్యసాయి జిల్లాకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఆగస్టు 1న సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర(M) గుండుమలలో లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్లు అందజేయనున్నారు. మల్బరీ నాట్లు, పట్టుపురుగుల షెడ్లు పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి, గ్రామస్థులతో మాట్లాడనున్నారు. అదే రోజు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని, ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నారు.

Similar News

News November 26, 2025

అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్

image

AP: విద్యార్థులు ప్రాథమిక హక్కులనే కాకుండా ప్రాథమిక బాధ్యతలనూ తెలుసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఏదైనా అంశంపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 175 మంది స్టూడెంట్లతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘మగాళ్లతో సమానంగా ఆడవాళ్లను గౌరవించిన, అన్ని రంగాల్లో ప్రోత్సహించిన దేశమే అభివృద్ధి చెందుతుంది. అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.

News November 26, 2025

అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్

image

AP: విద్యార్థులు ప్రాథమిక హక్కులనే కాకుండా ప్రాథమిక బాధ్యతలనూ తెలుసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఏదైనా అంశంపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 175 మంది స్టూడెంట్లతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘మగాళ్లతో సమానంగా ఆడవాళ్లను గౌరవించిన, అన్ని రంగాల్లో ప్రోత్సహించిన దేశమే అభివృద్ధి చెందుతుంది. అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.

News November 26, 2025

‘పీఎం కుసుమ్’తో సాగులో సోలార్ వెలుగులు

image

TS: వచ్చే 4 ఏళ్లలో వ్యవసాయ బోర్లకు పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. PM కుసుమ్ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో 28.60 లక్షల బోర్లకు రాయితీలు, 4,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రైతు సంఘాలతో ఏర్పాటుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని TG ప్రభుత్వం కోరింది. అలాగే రైతులు తమ పొలాల్లో సొంతంగా ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానల్స్‌కు రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.