News October 20, 2024

వ్యక్తి కాళ్లు మొక్కబోయిన సీఎం చంద్రబాబు

image

AP: అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్న సీఎం చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటుండగా ఓ వ్యక్తి ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో చంద్రబాబు కూడా ఆ వ్యక్తి కాళ్లను పట్టుకునేందుకు కొంచెం నడుము ఒంచారు. దీంతో అతను కంగుతిన్నాడు. తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కరించాలని, తన కాళ్లకు మొక్కితే తాను అలాగే చేస్తానని ఇటీవల CBN చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News December 21, 2025

ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ అన్యాయం: రేవంత్

image

TG: కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం పెట్టిన ద్రోహి KCR అని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ఆ సంతకంతో 3 జిల్లాలకు మరణశాసనం రాశారని విమర్శించారు. ‘ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కాళేశ్వరం కూలినా వరి ఉత్పత్తిలో TGని అగ్రస్థానంలో నిలిపాం. కృష్ణా జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. పదేళ్ల KCR పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు’ అని చిట్‌చాట్‌లో మండిపడ్డారు.

News December 21, 2025

KCR నోట 15 సార్లు చంద్రబాబు పేరు!

image

చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ దాదాపు 15 సార్లు ఆయన పేరును ఉచ్చరించారు. ఆనాటి పాలమూరు దత్తత, ఆర్డీఎస్ ధ్వంసం, కృష్ణా, గోదావరి జలాలను దోచుకుంటున్నారంటూ పదేపదే ఎత్తి చూపారు. కేంద్రం మద్దతుతో చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఫైరయ్యారు. పెట్టుబడుల్లోనూ టీడీపీ అధినేతపై జోకులు పేల్చారు. దీంతో మళ్లీ కేసీఆర్ సెంటిమెంటును తెరపైకి తెచ్చారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

News December 21, 2025

KCR మారతారని ఆశించా కానీ..: CM రేవంత్

image

TG: రెండేళ్ల తర్వాత కేసీఆర్ కలుగులో నుంచి బయటకు వచ్చారని CM రేవంత్ అన్నారు. JAN 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, కేసీఆర్ రావాలని ఆహ్వానించారు. ఓటమితో కేసీఆర్ మారతారని ఆశించా కానీ మళ్లీ అబద్ధాలే చెప్పారని వ్యాఖ్యానించారు. ఆయనకు అధికారం పట్ల ఉన్న వ్యామోహం ప్రజల పట్ల లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాకే జలదోపిడీ జరిగిందని మీడియాతో చిట్‌చాట్‌లో ఆరోపించారు.