News July 16, 2024

ఢిల్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని చంద్రబాబు మంత్రులతో చెప్పారు. రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Similar News

News November 23, 2025

వాహనదారులకు అలర్ట్.. ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే..

image

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆకస్మిక తనిఖీల కోసం 33 జిల్లా, 3 రాష్ట్ర స్థాయి స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. గత 10రోజుల్లో 4,748 కేసులు నమోదవగా, 3,420 వాహనాలు సీజ్ చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తూ తొలిసారి పట్టుబడితే వెహికల్ సీజ్ చేస్తారు. రెండో సారి పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇకపై లైసెన్స్ రెన్యువల్ టైంలో భారీ వాహనాల డ్రైవర్లకు రీఫ్రెషర్ ట్రైనింగ్ ఉంటుంది.

News November 23, 2025

జట్టులోకి గిల్ రీఎంట్రీ అప్పుడేనా?

image

టీమ్ ఇండియా టెస్ట్, ODI కెప్టెన్ గిల్ SAతో జరిగే ODI, T20 సిరీస్‌లో ఆడటం కష్టమని క్రీడా వర్గాలు వెల్లడించాయి. మెడ నొప్పి నుంచి ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టొచ్చని పేర్కొన్నాయి. 2026 జనవరి 11 నుంచి NZతో జరిగే ODI సిరీస్‌లో ఆయన రీఎంట్రీ ఇస్తారని తెలిపాయి. కాగా SAతో ODI, T20 సిరీస్‌కు BCCI ఇవాళ జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ODIలకు KL/అక్షర్/పంత్‌లో ఒకరు కెప్టెన్సీ చేసే ఛాన్సుంది.

News November 23, 2025

2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

image

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్‌పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.