News February 2, 2025
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం HYD నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఆయన సాయంత్రం కేంద్ర మంత్రులను కలవనున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలపనున్నారు. రేపు బీజేపీ అభ్యర్థుల తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. TG CM రేవంత్ సైతం ఢిల్లీలో నేడు, రేపు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Similar News
News January 21, 2026
9 మంది కూతుళ్ల తర్వాత కొడుకు.. మళ్లీ అక్కడే!

ఆడ పిల్లలున్నా మగ సంతానం కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు కొందరు దంపతులు. హరియాణాలోని జింద్(D)లో 10వ ప్రసవంలో కొడుక్కి జన్మనిచ్చిందో మహిళ. ఉచానా కలాన్లో సురేంద్ర, రీతుకు ఇప్పటికే 9 మంది కూతుళ్లు ఉండటం గమనార్హం. అమ్మాయిలకు కాఫీ(ఇక చాలు), మాఫీ(క్షమాపణ) పేర్లు పెట్టామని, ఇక తమకు పిల్లలు చాలని రీతు చెప్పారు. ఇటీవల ఉచానాలోనే 10 మంది <<18796058>>ఆడపిల్లలున్న మహిళ<<>> 11వ సారి గర్భం దాల్చి కొడుకుకు జన్మనివ్వడం తెలిసిందే.
News January 21, 2026
విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి: లోకేశ్

AP: విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేశ్ ఆ కంపెనీ CEO రవికుమార్ సింగిశెట్టిని కోరారు. దావోస్లో ఆయనతో భేటీ అయిన లోకేశ్.. తాత్కాలిక సౌకర్యాల ద్వారా ఉద్యోగుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. Ai, క్లౌడ్, డేటా, డిజిటల్ ఇంజినీరింగ్, CTS నియామక అవసరాలకు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు.
News January 21, 2026
కేంద్రం కీలక నిర్ణయం.. రైతులకు లాభం

నకిలీ, నాణ్యత లేని పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే వీటి తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం ‘పురుగుమందుల నిర్వహణ బిల్లు, 2025’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం నకిలీ పురుగు మందులను విక్రయిస్తే రూ.50 లక్షల వరకు జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సుంది. కేంద్రం నిర్ణయంలో కీలక అంశాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.


