News September 20, 2025
నేడు మాచర్లకు సీఎం చంద్రబాబు

AP: నేడు CM చంద్రబాబు పల్నాడు(D) మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.10.30 గం.కు మాచర్లకు చేరుకుని స్థానిక చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టనున్నారు. హెల్త్ క్యాంపులో సఫాయి కర్మచారీలతో మాట్లాడనున్నారు. మున్సిపాల్టీలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు రూ.2 కోట్ల చెక్కు అందించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సన్మానించనున్నారు.
Similar News
News September 20, 2025
రూ.35వేల కోట్లంటూ హరీశ్ తప్పుడు ప్రచారం: ఉత్తమ్

TG: తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి <<17757923>>రూ.35వేల కోట్లు<<>> అంటూ హరీశ్ రావు చేసిన ప్రకటన అబద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకే నీళ్లొస్తాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, అయితే ప్రభుత్వం అంచనాలు రూపొందించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని చెప్పారు.
News September 20, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ నేడు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆఫీసర్లతో సీఎం రేవంత్ భేటీ. అభివృద్ధి పనుల తీరు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం
☛ ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను లంచం అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. టోల్ ఫ్రీ నంబర్ 18005995991కి ఫిర్యాదు చేయవచ్చు: మంత్రి పొంగులేటి
☛ అక్టోబర్ నుంచి పత్తి కొనుగోళ్లు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
☛ నేటి నుంచి PGECET తుది విడత కౌన్సెలింగ్
News September 20, 2025
రేపటి నుంచే బతుకమ్మ వేడుకలు

పరమాత్మతో పాటు ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే అందమైన పండుగ బతుకమ్మ. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం. ఆదిపరాశక్తిని పూల రూపంలో పూజించడం దీని ప్రత్యేకత. భక్తులు తమ మనసులో కొలువై ఉన్న గ్రామ దేవతలను ఆవిష్కరించి, పాటల రూపంలో తమ భక్తిని చాటుకుంటారు. ఈ పండుగ ఆధ్యాత్మికత, ప్రకృతితో మనిషిని ఏకం చేస్తుంది.