News July 20, 2024
వైసీపీ కార్యకర్త హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు

AP: పల్నాడు జిల్లా వినుకొండ <<13650476>>హత్య<<>> గంజాయి వల్లే జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ పెంచి, పోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో శ్వేతపత్రాల్లోని వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్కు లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీ వెళ్తామని డ్రామాలు ఆడుతున్నారని TDP ఎంపీలతో సమావేశంలో విమర్శించారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.