News October 13, 2025
నేడు CRDA భవనం ప్రారంభించనున్న CM చంద్రబాబు

AP: ఇవాళ్టి నుంచి అమరావతి కేంద్రంగా పుర పరిపాలన ప్రారంభం కాబోతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేయాల్సిన అన్ని శాఖలు ఈ భవనం నుంచే పనిచేస్తాయి. నేడు ఉ.9.54కు CM చంద్రబాబు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దీనికి రైతులందరూ ఆహ్వానితులే అని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు అన్నదాతలు తమ సమస్యల పరిష్కారానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చేది.
Similar News
News October 13, 2025
15 నెలలవుతున్నా మార్పులేదు: అమరావతి రైతు ఐకాస

AP: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని అమరావతి రైతు ఐకాస నాయకులు వాపోయారు. అసైన్డ్ రైతుల భూములు, కౌలు చెల్లింపులు, ప్లాట్ కేటాయింపులు తదితరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. CRDAలో కిందిస్థాయి అధికారులు రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. CM వీలైనంత త్వరగా తమతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
News October 13, 2025
నేడు, రేపు భారీ వర్షాలు

AP: మే నెల చివర్లో దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ట్రాల నుంచి నిష్క్రమిస్తున్నాయి. 2 రోజుల్లో రాష్ట్రం నుంచి కూడా వెళ్లిపోయే ఆస్కారం ఉండగా.. 3, 4 రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ కానున్నాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ప్రకాశం, ఏలూరు, ప.గో. తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
News October 13, 2025
ఒక్కసారి నాటితే ఆరుసార్లు కోతకు వచ్చే వరి రకం

వరిని ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట వస్తుంది. అయితే చైనాలోని ‘యున్నన్ అకాడమీ’ ఆరుసార్లు కోతకు వచ్చే వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. దీనికి ‘పెరెన్నియల్ రైస్- Pr23’ అని పేరు పెట్టింది. దీన్ని ఓసారి నాటితే మూడేళ్లలో వరుసగా 6 సీజన్లపాటు దిగుబడిని తీసుకోవచ్చు. దీన్ని 17 దేశాలు సహా తమిళనాడు, ఒడిశాలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.