News October 16, 2025
నవంబర్లో లండన్ పర్యటనకు CM చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్లో పర్యటించనున్నారు. విశాఖలో వచ్చేనెల 14, 15న జరగనున్న సీఐఐ సదస్సుకు రావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది.
Similar News
News October 16, 2025
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన ఉత్సవాలు.. కొత్త అప్లికేషన్ల స్వీకరణ

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గ్రామగ్రామాన జరిగే ఈ ఉత్సవాల్లో పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఏయే పథకాలకు అప్లికేషన్లు స్వీకరించాలనే అంశంపై రెండు రోజుల్లో సీఎస్ అధ్యక్షతన సమావేశమై వివరాలు వెల్లడించనున్నారు.
News October 16, 2025
కనికరం లేని దైవమే ‘భూతం’

<<17901211>>భూతం<<>> అంటే చెడు శక్తులు కాదన్న విషయం మనం తెలుసుకున్నాం. కానీ దైవానికి, భూతానికి మధ్య తేడా ఉంటుంది. దేవతలు దేశాన్ని రక్షిస్తూ, దయ, కనికరం చూపిస్తారు. వీరి వద్ద తప్పుకు విముక్తి ఉంటుంది. కానీ భూతాలు గ్రామాన్ని మాత్రమే చూసుకునే స్థానిక దైవాలు. వీటికి కనికరం ఉండదు. ఓ వ్యక్తి తప్పు చేస్తే వెంటనే శిక్షను విధిస్తాయి. అందుకే ఈ ఉగ్ర శక్తిని గ్రామస్థులు ఎక్కువగా నమ్ముతారు. భయపడతారు. <<-se>>#Kanthara<<>>
News October 16, 2025
రంజీ ట్రోఫీ.. 40 ఏళ్ల వయసులో రికార్డు

రంజీ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా J&K కెప్టెన్ పరాస్ డోగ్రా(40 ఏళ్లు) నిలిచారు. ముంబైతో మ్యాచులో ఆయన 32వ సెంచరీ నమోదు చేశారు. 42 సెంచరీలతో మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే రంజీల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో జాఫర్ (12,038) తర్వాత డోగ్రా(9,500) రెండో స్థానంలో ఉన్నారు. 2001-02లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన డోగ్రా గతంలో HP, పుదుచ్చేరి జట్లకు ఆడారు.