News June 25, 2024

నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు ఆయన అక్కడ పర్యటించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను CBN కలవనున్నారు. కాగా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఎనిమిదోసారి గెలిచారు. 1989 నుంచి ఆయనకు ఇక్కడ ఎదురులేకుండా పోయింది.

Similar News

News January 14, 2026

తాడిపత్రిలో పందుల పోటీలు

image

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని తాకుతున్న వేళ అనంతపురం జిల్లాలో వినూత్నంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఎక్కడైనా కోడి పందేలు, రాతిదూలం లాగుడు పోటీలు, బల ప్రదర్శన పోటీలు చూశాం. కానీ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న రీతిలో పందుల పోటీలను జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. తాడిపత్రి వాసులు మాత్రం ఈ పోటీలను జేసీ 10 ఏళ్ల కిందటే నిర్వహించారని హర్షం చేశారు.

News January 14, 2026

BREAKING: భారత్ ఓటమి

image

టీమ్ ఇండియాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ సెంచరీ (131*)తో చెలరేగి తమ జట్టుకు విజయాన్ని అందించారు. యంగ్ 87 పరుగులతో రాణించారు. మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరగనుంది.

News January 14, 2026

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ హెచ్చరికతో..

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తమ దేశంపై అమెరికా స్ట్రైక్ చేస్తే మిడిల్ ఈస్ట్‌లోని US మిలిటరీ బేస్‌‌లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఖతర్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి తమ సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలిచింది. ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కాగా మిడిల్ ఈస్ట్‌లో USకు ఇదే అతిపెద్ద మిలిటరీ బేస్. ఇందులో 10వేలకు పైగా అమెరికా సైనికులు ఉంటారు.