News November 2, 2024
నేడు ‘రుషికొండ’కు సీఎం చంద్రబాబు

AP: ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ విశాఖలోని రుషికొండ భవనాలను పరిశీలించనున్నారు. గత ప్రభుత్వం రూ.500 కోట్లతో నిర్మించిన వీటిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ భవనాలను నిర్మించడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News October 17, 2025
తుపాకీ వదిలిన ఆశన్న

మావోయిస్టు పార్టీలో మరో శకానికి తెరపడింది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 2రోజుల కింద లొంగిపోగా ఇవాళ ఇంకో టాప్ కమాండర్ ఆశన్న(తక్కళ్లపల్లి వాసుదేవరావు) సరెండర్ అయ్యారు. 25ఏళ్లుగా ఆయన ఎన్నో దాడులకు వ్యూహకర్తగా పనిచేశారు. AP CM చంద్రబాబు, మాజీ CM నేదురుమల్లి జనార్దన్రెడ్డిపై బాంబు దాడితో హత్యాయత్నం, 1999లో IPS ఉమేశ్చంద్ర, 2000లో నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలకు నేతృత్వం వహించినట్లు ప్రచారం.
News October 17, 2025
అమరావతికి స్టార్ హోటళ్ల కళ

AP: అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా ప్రముఖ స్టార్ హోటళ్లు కొలువుదీరేలా ఏర్పాట్లు చేస్తోంది. దసపల్లా ₹200 కోట్లతో, SGHRL ₹177 కోట్లతో 4స్టార్ హోటళ్లను నెలకొల్పనున్నాయి. VHR సంస్థ అరకులో ₹56 కోట్లతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించడానికి ప్రతిపాదించింది. వీటికి 10 ఏళ్లవరకు SGST, 5 ఏళ్ల వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
News October 17, 2025
కోహ్లీ వరల్డ్ రికార్డు సృష్టిస్తాడా?

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 7 నెలల తర్వాత ఈనెల 19న AUSతో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ సిరీస్లో తను వరల్డ్ రికార్డు నెలకొల్పే అవకాశముంది. 3 మ్యాచ్ల్లో ఒక్క సెంచరీ చేసినా 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలుస్తారు. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా విరాట్ వన్డేల్లో 51 శతకాలు బాదారు. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును అతడు అధిగమిస్తారు.