News September 18, 2024
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP: వాలంటీర్లపై NDA శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రితమే పూర్తైతే, రెన్యూవల్ చేయలేదు. వాళ్ల పేరోల్స్(జీతాల బిల్లులు) కూడా లేరు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారు. కానీ మనం 3 నెలల జీతం ఇచ్చాం. కొందరు రాజీనామా చేశారు. చేయని వాళ్లకు ఇచ్చిన ఆర్డర్స్కు కూడా గడువు ముగిసింది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
Similar News
News October 22, 2025
ఏడడుగులు ఎందుకంటే?

మొదటి అడుగు – శారీరక బలం కోసం
రెండో అడుగు – మానసిక బలం కోసం
మూడో అడుగు – ధర్మాచరణ కోసం
నాల్గో అడుగు – కర్మ సంబంధమైన సుఖం కోసం
ఐదో అడుగు – పశు సమృద్ధి కోసం
ఆరో అడుగు – రుతువులలో తగిన ఆరోగ్యం కోసం
ఏడో అడుగు – సంసార జీవితాన్ని ‘ఒక యజ్ఞంగా’ భావించమని చెప్పే ‘స్నేహం’ కోసం
<<-se>>#Pendli<<>>
News October 22, 2025
రేపే మ్యాచ్.. 17 ఏళ్ల రికార్డ్ కాపాడుకుంటారా?

IND, AUS మధ్య రెండో వన్డే రేపు అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో జరగనుంది. తొలి మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా సెకండ్ ODIలో గెలిచి సిరీస్పై ఆశలు నిలుపుకోవాలని చూస్తోంది. కాగా అడిలైడ్లో 15 వన్డేలు ఆడిన IND 9 మ్యాచ్లు గెలిచింది. ఇక్కడ గత 17 ఏళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ రాణిస్తే రేపు భారత్కు తిరుగుండదు. మరి ఈ రికార్డును కాపాడుకుంటుందా? లేదా AUS బ్రేక్ చేస్తుందా? COMMENT
News October 22, 2025
మల్లోజుల, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ!

ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాళ్లు నమ్మకద్రోహం చేశారని, శిక్ష తప్పదంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఇటీవల హెచ్చరిక లేఖ విడుదలైంది. దీంతో ఆ ఇద్దరు అగ్రనేతలకు ఏమైనా జరిగితే చెడ్డపేరు వస్తుందని, ఇతర మావోయిస్టుల లొంగుబాట్లకు ఇబ్బంది వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.