News June 28, 2024
పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ

AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ CM చంద్రబాబు పెన్షన్దారులకు లేఖ రాశారు. దీన్ని పెన్షన్లతోపాటు జులై 1న ఉద్యోగులు పంపిణీ చేయనున్నారు. ‘మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 65,18,496 మందికి పెంచిన పింఛన్లు అందిస్తున్నాం. దీనివల్ల నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా మీ శ్రేయస్సు కోసం అమల్లోకి తెచ్చాం. రూ.7వేలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్మెంట్ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.
News November 7, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News November 7, 2025
బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.


