News October 31, 2024
రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మరుసటి రోజు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో చంద్రబాబు పర్యటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.826 కోట్లతో చేపడుతున్న రహదారి మరమ్మతు పనులను ప్రారంభిస్తారు.
Similar News
News October 27, 2025
పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.
News October 27, 2025
ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్: రహానే

టీమ్ ఇండియా సెలక్టర్లపై రహానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆటలో ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్. అనుభవమున్న, డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న నా లాంటి ప్లేయర్లను సెలక్టర్లు కన్సిడర్ చేయాలి. కమ్బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ ఛాన్సులివ్వాలి. కానీ వారి నుంచి సరైన కమ్యునికేషన్ లేదు. సెలెక్ట్ చేసినా చేయకపోయినా గేమ్ను ఆస్వాదిస్తా. BGT 2024-25లో టీమ్కు నా అనుభవం పనికొచ్చేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News October 27, 2025
అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం


