News October 31, 2024

రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మరుసటి రోజు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో చంద్రబాబు పర్యటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.826 కోట్లతో చేపడుతున్న రహదారి మరమ్మతు పనులను ప్రారంభిస్తారు.

Similar News

News November 28, 2025

‘థర్డ్ వరల్డ్’ దేశాల లిస్ట్‌లో భారత్‌ ఉందా?

image

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను నిలిపివేస్తామని ట్రంప్<<18410545>> ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ‘థర్డ్ వరల్డ్’ పదం ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాపులర్ అయింది. అప్పట్లో అమెరికా-నాటో దేశాలు ఫస్ట్ వరల్డ్, సోవియట్ యూనియన్ అనుబంధ దేశాలు సెకండ్ వరల్డ్‌గా, ఏ పక్షానికీ చేరని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాలను ‘థర్డ్ వరల్డ్’ అని పిలిచేవారు. UN LDCs లిస్ట్ ప్రకారం ఇందులో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో భారత్‌ లేదు.

News November 28, 2025

మేనరిక వివాహాలు చేసుకుంటున్నారా?

image

మేనరికపు వివాహాలు చేసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వివాహం అయితే జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కి వెళ్లాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్‌ కారణాలతో గర్భస్రావం అవుతుంటే కార్యోటైప్‌ టెస్ట్‌, అబార్షన్‌ అయితే పిండానిదీ, తల్లిదండ్రులదీ జెనెటిక్‌ మేకప్‌ చేయించుకోవాలి. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ముందే చెక్ చేయించుకోవాలి.

News November 28, 2025

అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం

image

AP: రాజధాని అమరావతి పరిధిలో రెండోదశ భూసమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 7 గ్రామాల (వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి) పరిధిలోని 16,666.5 ఎకరాలను సమీకరించాలని CRDAకు అనుమతి ఇచ్చింది. దీంతో ల్యాండ్ పూలింగ్‌కు CRDA నోటిఫికేషన్ ఇవ్వనుంది. కాగా తొలివిడతలో ప్రభుత్వం 29 గ్రామాల్లోని 30వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించిన విషయం తెలిసిందే.