News February 28, 2025

అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌కు సీఎం అభినందనలు

image

AP: అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెడికో అంబుల వైష్ణవిని నియమిస్తూ CRDA ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును ఆమె కలవగా అభినందనలు తెలిపారు. రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆమెకు సూచించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఆమె ఇప్పటివరకు రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

Similar News

News January 21, 2026

పగిలిన గుడ్లు తక్కువ ధరకే.. తింటే ఇబ్బందులు

image

పగిలిన గుడ్లను షాపుల్లో తక్కువ ధరకే విక్రయించడం తెలిసిందేగా. కాస్త పగిలిందనో, కేవలం పగుళ్లే కదా అని తీసుకెళ్లి వండుకుంటున్నారా? అయితే మీరు అనారోగ్యానికి గురికావచ్చు. ఎగ్ పెంకు పగిలిందంటే లోపలికి బ్యాక్టీరియా వెళ్లి పాడవుతాయి. చూసేందుకు, వాసన మామూలుగా ఉన్నా లోపల క్రిములు డెవలప్ అవుతాయి. కాబట్టి తక్కువ ధరకే వస్తుందని వాటిని తింటే విరేచనాలు మొదలు ఒక్కోసారి తీవ్ర అస్వస్థతకు గురికావచ్చు.
Share It

News January 21, 2026

రేపు జగన్ మీడియా సమావేశం

image

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.

News January 21, 2026

నీటి నిష్క్రమణ ఏ దిశలో ఉండటం వాస్తు సమ్మతం?

image

ఇంటి వాడకం నీరు, వర్షపు నీరు ఈశాన్యం నుంచే వెళ్లాలని అంటారు. కానీ ఇది అన్ని దిశల ఇళ్లకు వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పడమర/ దక్షిణం వైపు రోడ్లు ఉన్న ఇళ్లకు ఈశాన్యం లోపలి వైపు ఉంటుంది. అలాంటివారు పడమర వాయువ్యం/దక్షిణ ఆగ్నేయం దిశల నుంచి నీటిని బయటకు పంపాలి. ప్రతి దిక్కుకు ఉండే శుభ ఫలితాలనిచ్చే మూలల ద్వారా నీరు వెళ్లడం వల్ల ఎటువంటి హాని జరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>